త్రిష, కీర్తితో సమంత పార్టీ

Samantha and Keerthy Suresh


సాధారణంగా హీరోయిన్ల మధ్య పోటీ తప్ప స్నేహం ఉండదు అనుకుంటారు. కానీ శృతి హాసన్, తమన్న క్లోజ్ ఫ్రెండ్స్. సమంత, కీర్తి సురేష్ మధ్య కూడా మంచి స్నేహం ఉంది. అంతే కాదు, నలుగురు, ఐదుగురు హీరోయిన్లు ఒకే సిటీలో ఉంటే పార్టీలు కూడా చేసుకుంటారు. అలాంటి ఫ్రెండ్షిప్ మైంటైన్ చేస్తారు.

Advertisement

లేటెస్ట్ గా త్రిష, కీర్తి సురేష్, కళ్యాణ్ ప్రియదర్శన్, సమంత చెన్నైలో పార్టీ చేసుకున్నారు. ఆ ఫోటోలను, వీడియోలను సమంత తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఆమె ప్రస్తుతం చెన్నైలో విగ్నేష్ శివన్ తీస్తున్న తమిళ చిత్రం షూటింగ్ లో పాల్గొంటోంది. దాంతో, చెన్నైలోనే ఉండే త్రిష, కీర్తి సురేష్ ని పిలిచి పార్టీ చేసుకున్నారు.

తన వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న పరిణామాల గురించి మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ఆమె ప్రతి పోస్ట్ ను అందరూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కానీ ఆ రూమర్ల గురించి ప్రస్తుతం సమంత స్ట్రాటజిక్ సైలెన్స్ పాటిస్తోంది.

ఆమె ప్రస్తుతం తన సినిమా షూటింగ్ లతో, తన వర్క్ తో బిజీగా ఉన్నారు.

Advertisement
 

More

Related Stories