- Advertisement -

ఘాజి దర్శకుడు సంకల్ప్ రెడ్డి బాలీవుడ్ లో తన లక్ ని టెస్ట్ చేసుకుంటున్నాడు. ‘ఘాజి’ సినిమాతో బాలీవుడ్ లో కూడా పేరు సంపాదించాడు సంకల్ప్. దాంతో ఒక బాలీవుడ్ కార్పొరేట్ నిర్మాణ సంస్థ అతనితో ఒప్పందం కుదుర్చుకొంది. ఆ సంస్థ … యాక్షన్ హీరో విద్యుత్ జమాల్ ని హీరోగా తీసుకొంది. విద్యుత్ …సంకల్ప్ చెప్పిన కథకి ఓకే చెప్పాడు
సంకల్ప్ తన రెండో సినిమాగా తీసిన ‘అంతరిక్షం’ నిరాశ పర్చడంతో తెలుగులో మరో సినిమాని ప్రకటించలేదు. ఐతే ఈ టాలెంటెడ్ కుర్రాడిని బాలీవుడ్ ఆహ్వానం పలికింది.
కరోనా క్రైసిస్ ముగిసిన తర్వాత ఈ సినిమా మొదలవుతుంది. సంకల్ప్ ఇప్పటికే … లస్ట్ స్టోరీస్ తెలుగు వెర్షన్ లో ఒక కథ డైరెక్ట్ చేశాడు. ఈ కథలో ఈషా రెబ్బ నటించింది.