నేడు త్రిష పుట్టిన రోజు. ఆమె ఇప్పుడు 38లోకి అడుగుపెట్టింది. కోవిడ్ 19 కారణంగా ఎటువంటి హడావిడి లేకుండా చెన్నైలోని తన ఇంట్లోనే సెలెబ్రేషన్స్ జరుపుకొంది.
మరోవైపు, మొన్నటివరకు ఆమె పర్సనల్ లైఫ్ గురించి జోరుగా సాగిన ఊహాగానాలు బందయ్యాయి. హీరో శింబుని పెళ్లి చేసుకోనుందని మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఒక వ్యాపారవేత్తతో మ్యాచ్ కుదిరిందని ప్రచారం జరిగింది. కానీ ఆమె మాత్రం మౌనంగానే ఉంటోంది. ఎంత ప్రచారం జరిగినా
స్పందించలేదు.
అనుష్క శెట్టిలాగే త్రిష కూడా 40కి చేరువలోకి వచ్చినా పెళ్లి ఊసు ఎత్తడం లేదు.
Advertisement