‘వ్యూహం’ రెండో టీజర్ విడుదల

Vyooham

త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. దాంతో, రామ్ గోపాల్ వర్మ మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఒక సినిమా తీస్తున్నారు. ఈ సినిమా పేరు ‘వ్యూహం’. రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు.

Advertisement

ఈ సినిమాని వై.ఎస్. జగన్ జైలుకి వెళ్లిన నేపథ్యం, రాష్ట్రం విడిపోవడంతో అతను ఇరుకున పడ్డ వైనం చూపిస్తున్నారు. ఐతే, మెయిన్ టార్గెట్ మాత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఈ రెండో టీజర్ నిండా వారిని టార్గెట్ చేసిన సీన్లే ఉన్నాయి.

వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో అజ్మల్ నటించాడు. వైయస్‌.భారతీ పాత్రలో మానస నటించింది.

‘వ్యూహం’ చిత్రీకరణ 50 శాతానికి పైగా పూర్తి అయ్యిందని నిర్మాత దాసరి కిరణ్ తెలిపారు.

'వ్యూహం' మూవీ టీజర్.2 | RAMGOPAL VARMA'S 'VYOOHAM' MOVIE TEASER.2 | RGV | VYOOHAM MOVIE |
Advertisement
 

More

Related Stories