
సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ (Ameesha Patel) అలియా భట్ (Alia Bhatt)కి మద్దతుగా పోస్ట్ పెట్టింది.
ఇటీవల హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt)తెగ ట్రోలింగ్ కి గురి అయింది. కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పైకి వెళ్లి అలియా భట్ కెమెరామెన్ లకు ఫోజులి ఇచ్చింది. కానీ ఒక్క అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ ఆమెని పట్టించుకోలేదు. కెమెరాలో బంధించలేదు. ఆమెని ఎవరూ పట్టించుకోకుండా ఇతర అంతర్జాతీయ సెలెబ్రిటిలను ఫోటోలు తీస్తూ బిజీ అయిపోయారు. ఆ విడియో వైరల్ అయింది.
“ఇటీవలి సంఘటనలు మన భారతీయ మనస్తత్వం తెలియచేశాయి. ఇతరులను కించపరచడమేనా మన పద్దతి. మనం ఒకే జాతిగా, ఐక్యంగా ఉన్నామని చెప్పుకుంటాం – కానీ నిజానికి మనం ఉన్నామా?,” అని ఆమె పోస్ట్ లో పేర్కొంది.
“హాలీవుడ్ తారలు తమ దేశంలో తమ సొంత ప్రజల చేత ట్రోల్ చేయబడే దానికంటే, ఇక్కడి భారతీయ నటులు మన సొంత ప్రజల చేత మరింత దారుణంగా ట్రోల్ చేయబడుతున్నారు, ఇది చాలా విచారకరం! అంతర్జాతీయ కార్యక్రమాలలో ఒక భారతీయ తార కనిపిస్తే… ఆ తార సొంత ప్రజల నుంచే ట్రోలింగ్ కి గురి అవుతున్నారు . ఇది ఎంత సిగ్గుచేటు?” అని మరో పోస్ట్ లో అలియా భట్ పేరు పెట్టకుండా ఆమెకి మద్దతుగా రాశారు.
