
హీరోయిన్ మౌని రాయ్ (Mouni Roy) తన భర్తతో విడిపోయింది. మౌని రాయ్, ఆమె భర్త సూరజ్ నంబియార్ (Suraj Nambiar) సంయుక్త ప్రకటన విడుదల చేశారు ఇటీవల. అదీ కూడా ఇద్దరూ తమ తమ ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్స్ ద్వారా.
ఆ ప్రకటన వచ్చిన ఈ మూడు రోజుల్లో అనేక రకాల ఊహాగానాలు సాగుతున్నాయి. వీరి జీవితాల్లో మూడో పర్సన్ ప్రవేశం వల్లే విడిపోయారు అని మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం చక్కర్లు కొడుతోంది.
సూరజ్ కి మరో అమ్మాయితో అఫైర్ మొదలైంది అనీ, అది తెలిసి మౌని రాయ్ దూరమైంది అని ఒక ప్రచారం సాగుతోంది.
మరికొందరు మౌని రాయ్ స్నేహితురాలు, నటి దిశా పటాని (Disha Patani) వల్లే మౌని విడిపోయింది అని అంటున్నారు. మౌని, దిశా ఎక్కడికి వెళ్లినా కలిసే టూర్లు వేస్తుంటారు. ఇద్దరూ ఒకప్పుడు రూమ్ మేట్స్. ఐతే, దిశాకి ఇంకా పెళ్లి కాలేదు. ఆమె బిందాస్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటుంది. తన ఫ్రెండ్ ని కూడా దిశా చెడగొట్టింది అని ఒక కామెంట్ సోషల్ మీడియాలో తిరుగుతోంది.
ఐతే, సూరజ్ తాజాగా మరో పోస్ట్ పెట్టాడు. “మీడియాలో, సోషల్ మీడియాలో సాగుతున్న గలీజ్ ప్రచారం బంద్ చెయ్యండి. మేమిద్దరం గౌరవపూర్వకంగా విడిపోతున్నాం. మా మధ్య మూడో వ్యక్తి ముచ్చట లేదు. మా కాపురంలో ఎవరూ నిప్పులు పొయ్యలేదు. మేమిద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం. ఇతరులను ఇందులోకి లాగి వారి గౌరవాన్ని భంగం చెయొద్దు,” అని పేర్కొన్నాడు.
