
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం వేగంగా నడుస్తోంది. తాజాగా మేకర్స్ ఎక్సయిటింగ్ అప్డేట్ను షేర్ చేశారు.
ఈ చిత్రంలో సాక్షి మడోల్కర్ (Sakkshi Mhadolkar) హీరోయిన్గా ఎంపికైంది. ఆమెకు టీమ్లోకి వెల్కమ్ చెబుతూ విడుదల చేసిన వీడియోలో షూటింగ్ స్పాట్లోని ఫన్ వైబ్ను చూపించారు. ఈ అమ్మడు ఇంతకుముందు రోషన్ కనకాల సరసన “మౌగ్లీ” అనే చిత్రంలో నటించింది. ఆ సినిమా ఆడలేదు కానీ ఆమె అందానికి గుర్తింపు దక్కింది. హిందీలో త్రి మంకీస్, జహ చార్ యార్ వంటి ప్రాజెక్ట్స్ లో నటించింది.
నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బలమైన తారాగణం, టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది.
సామజవరగమనకి పని చేసిన రైటర్స్ భాను భోగవరపు, నందు సావిరిగణ ఈ సినిమాకి పని చేస్తున్నారు. కొత్త కథాంశంతో కూడిన కథనంతో వినోదాత్మక పద్దతిలోనే తీస్తున్నారట.
