
పవన్ కళ్యాణ్, తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన “బ్రో” (Bro) సినిమా 2023లో విడుదలైంది. నటుడు, దర్శకుడు సముద్రఖని ఈ సినిమాని తీశారు. ఆ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ నటించినా ఆ సినిమాకి కనీస ఓపెనింగ్ కూడా రాలేదు.
అది తీసిపారేసే సినిమా కాదు కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ లేని ఆ చిత్రం అభిమానులకు నచ్చలేదు. సామాన్య ప్రేక్షకులు అటువైపు చూపే వెయ్యలేదు.ఇక తాజాగా “ఉస్తాద్ భగత్ సింగ్” నిరాశ పర్చడంతో అభిమానులు పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలపై ఒక కచ్చితమైన అభిప్రాయానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ కొంచెం కమర్షియల్ గా క్రేజ్ ఉన్న దర్శకులతోనే సినిమాలు చెయ్యాలి అనేది వారి డిమాండు.
ఐతే, తాజాగా సముద్రఖని తన తమిళ్ చిత్రాన్ని ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఆ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలలో “బ్రో” సినిమాకి సీక్వెల్ (Bro 2) తీస్తాను అని ప్రకటించాడు.
“నా దగ్గర బ్రో సీక్వెల్ కథ, స్క్రిప్ట్ రెడీగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే చాలు మొదలుపట్టేస్తా,”అని సముద్రఖని అన్నారు.
దాంతో, వద్దు బ్రో, మీ స్క్రిప్ట్ వద్దు, మీ సినిమా వద్దు, మా హీరో దగ్గరికి అసలే వెళ్లొద్దు అని సోషల్ మీడియాలో సముద్రఖనిని ట్రోల్ చేస్తున్నారు.
