
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas), కావ్య రెడ్డి (Kavya Reddy)కి సంబంధించి రోఖా ఫంక్షన్ (నిశ్చితార్థం లాంటిదే కానీ) ఇటీవలే జరిగింది. ఇక ఇప్పుడు సాంప్రదాయ పద్దతిలో నిశ్చితార్థం ఏప్రిల్ 5న హైదరాబాద్లో జరగనుంది. ఈ ఎంగేజ్ మెంట్ ని గ్రాండ్ గా చేస్తారట.
కానీ పెళ్లి మాత్రం నిరాడంబరంగా జరుగుతుందట. ఏప్రిల్ 29న తిరుపతిలో వీరి వివాహ వేడుకని నిర్వహిస్తారు. పెళ్లిని సింపుల్ గా కానిచ్చి మే 1న హైదరాబాద్లో ఒక భారీ విందు (రిసెప్షన్) ఇస్తారట.
బెల్లంకొండ శ్రీనివాస్, కావ్యరెడ్డి చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆమె విదేశాల్లో చదువుకొని వచ్చింది. ఆమె ఇష్టప్రకారం తిరుపతిలో సింపుల్ గా వివాహ వేడుకని నిర్వహించనున్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం “టైసన్ నాయుడు” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కొన్నేళ్లుగా సా….గుతోంది. ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి. ఎందుకంటే ఈ సినిమాని నిర్మిస్తున్నది “అఖండ 2” నిర్మాతలు. ఆ సినిమానే ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడుదల విషయంలో గందరగోళం చేశారు.
