
హీరో శర్వానంద్ (Sharwanand) ఎమోషనల్ అయిపోయాడు. “బైకర్” (Biker) చిత్రం ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది. ఈ సినిమాకి వస్తున్న స్పందనతో అతను ఇలా ఎమోషనల్ అయి ప్రేక్షకులకు, దర్శకుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు.
హైదరాబాద్ లోని కిక్కిరిసిన శ్రీరాములు థియేటర్లో ప్రేక్షకుల స్పందన తెలుసుకునేందుకు వెళ్లి ఆ తర్వాత అలా నేలపై పడుకొని అభివందనం చేశాడు. అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగుతుంది. తండ్రిగా ఒకప్పటి హీరో రాజశేఖర్ నటించగా, కొడుకుగా శర్వానంద్ నటించాడు.
శుక్రవారం విడుదలైన ఈ చిత్రాన్ని నాగార్జున, నాగ్ అశ్విన్, వంశీ పైడిపల్లి, వంటి ప్రముఖులు మెచ్చుకున్నారు.
ఈ ఏడాది “నారి నారి నడుమ మురారి” చిత్రంతో మోస్తరు విజయం అందుకున్నాడు శర్వానంద్. ఇప్పుడు ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. మొదటి వీకెండ్ కలెక్షన్లు సాధారణంగానే ఉన్నాయి. కానీ మౌత్ టాక్ ప్లస్ అవుతుంది అని అంచనా వేస్తున్నారు.
