సమంత కొన్నది డుప్లెక్స్ కాదు


సమంత 8 కోట్లు పెట్టి ఒక డూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుగోలు చేసింది అనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఐతే, ఇందులో కొంతే నిజముంది. ఆమె కొన్నది డూప్లెక్స్ కాదు.

గచ్చిబౌలిలోని జయభేరి ఆరెంజ్ కౌంటీలో ఆమె కొన్నది నాలుగు బెడ్ రూంల అపార్ట్మెంట్. అంటే 4 BHK. ఆమె ఇన్వెస్ట్ మెంట్ లో భాగంగా కొన్నది. అది కూడా ఆరు కోట్ల రూపాయలకు. కానీ మీడియాలో మాత్రం అతిగా వార్తలు వచ్చాయి.

సమంత ప్రస్తుతం హైదరాబాద్ లోని తన సొంత అపార్ట్మెంట్ లోనే నివసిస్తున్నారు. ఇటీవల బ్రాండ్స్, వెబ్ సిరీస్ లు, సినిమాల ద్వారా పెద్ద మొత్తం ఆమెకి వచ్చింది. ఆ డబ్బుని ఇలా ఇన్వెస్ట్ చేసింది.

సమంత ఆస్తులపై బాలీవుడ్ మీడియా కన్నేసింది. ఉన్నది, లేనిది రాస్తున్నది బాలీవుడ్ మీడియా. దాన్ని యాజిటీజ్ గా ఇక్కడ కాపీ కొట్టేస్తున్నారు. సమంతకి హైదరాబాద్, ముంబైలో మంచి ఆస్తులు ఉన్నాయి. ఆమె కెరీర్ ప్రారంభం నుంచి ప్రాపర్టీలపై ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది.

ALSO READ: ఆమె గురించి మాట్లాడను: శోభిత

Advertisement
 

More

Related Stories