
ఆషు రెడ్డి (Ashu Reddy) పేరు ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్గా మారింది. లండన్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధర్మేంద్ర (Dharmenda)ను పెళ్లి పేరుతో మోసం చేసినట్లు ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కేసు కూడా నమోదైంది. ఈ కేసులో ఆషు రెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై నాన్-బెయిలబుల్ కేసు నమోదైనట్లు మీడియా సమాచారం.
మరోవైపు, ఆషురెడ్డి తండ్రి కూడా ధర్మేంద్ర చేసిన ఆరోపణలు నిజమే అని ప్రకటించారు. తల్లి ఆశుని తప్పుదోవ పట్టిస్తోందని ఆయన అంటున్నారు. అందుకే, తాను తన భార్య, కూతురు ఆశు నుంచి విడిగా ఉంటున్నట్లు తెలిపారు.
ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆషు అతని నుండి భారీగా డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దాదాపు ఐదు కేజీల బంగారం కొనిపించుకున్నదే కాకుండా, తన నివాసం కోసం విలాసవంతమైన విల్లా కోసం కూడా అడ్వాన్స్ తీసుకున్నట్లు సమాచారం.
ఇక వీరిద్దరూ కలిసి వేణుస్వామితో జాతకాలు చెప్పించుకుని, ప్రత్యేక పూజలు చేయించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధర్మేంద్రతో పెళ్లి ఖరారు అయిన తర్వాత, ఆమె అడిగిన ప్రతి అవసరానికి అతను డబ్బులు పంపినట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీలకు సంబంధించిన బ్యాంక్ వివరాలను ధర్మేంద్ర కుటుంబ సభ్యులు బయటపెట్టారు.
ఆషు రెడ్డి అకస్మాత్తుగా పెళ్లిని రద్దు చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఈ వివాదంపై ఆమె త్వరలోనే ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొంతమంది పెద్దలతో ఆమె మంతనాలు జరుపుతోంది ఈ కేసులో ఎలా ముందుకు పోవాలనే విషయంలో.
ఈ భామకి ఇన్ స్టాగ్రామ్ లో 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. హాట్ హాట్ ఫోటోలు ఎక్కువగా షేర్ చేస్తుంటుంది.
