
హీరో రామ్ చరణ్ (Ram Charan) ఇటీవల ఈస్క్వేర్ (Esquire) అనే మేగజైన్ కోసం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. హాంగ్ కాంగ్ వెళ్లి మరీ ఈ మేగజైన్ కోసం ఫోటోషూట్ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్ మొదలుకొని తన సినిమాల సెలెక్షన్ నుంచి తన ఆధ్యాత్మిక భావనల వరకు అన్నీ విషయాల్లో మనసు విప్పి మాట్లాడాడు.
రామ్ చరణ్, ఉపాసనకి ముగ్గురు పిల్లలు. మొదట కూతురు క్లిన్ కారా పుట్టగా, రీసెంట్ గా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కవలలుగా పుట్టారు. ఈ ముగ్గురు పిల్లలను రిచ్ కిడ్స్ గా పెంచే ఆలోచనలో లేరంట. వారు ధనవంతుల, సెలెబ్రిటీల పిల్లలుగా కానుందా స్వతంత్రంగా పెరిగేలా చూస్తాను అని అంటున్నాడు.
అంతే కాదు తాను పిల్లల విషయంలో సాఫ్ట్ గా ఉండను అని చెప్తున్నాడు. “తల్లిదండ్రుల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. నేను అలానే నేర్చుకున్నాను. మా పిల్లలు కూడా అలానే నేర్చుకోవాలనుకుంటాను. అందుకే, కొంచెం నేను స్ట్రిక్ట్ గానే ఉంటాను,” అని వివరించాడు రామ్ చరణ్.
ఇక అయ్యప్ప స్వామి మాల ప్రతి సంవత్సరం వేసుకోవడం వల్ల తన జీవితంలో ప్రశాంతత వచ్చింది అని తెలిపాడు. వ్యక్తిగా తనలో చాలా మంచి మార్పు తెచ్చిందట.
