
తమిళనాడులో ఎన్నికల వేడి ఎక్కువైంది. వచ్చే నెలలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు. దాంతో, విజయ్ (Vijay), త్రిష (Trisha) మధ్య బంధం రాజకీయ రంగు పులుముకొంది. విజయ్ ని విమర్శించేందుకు, టార్గెట్ చేసేందుకు త్రిషని తెగ ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో.
ఈ నేపథ్యంలో సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు కుష్బూ (Khushbu Sundar) త్రిష గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అని హెచ్చరించారు. ఆమె త్రిషకు బహిరంగ మద్దతు తెలిపారు. త్రిష చాలా “డిగ్నిఫైడ్”గా ఉంటుంది అని అన్నారు. “నేను చూసిన అత్యంత సున్నితమైన వ్యక్తుల్లో ఒకరు”అని కుష్బూ అభివర్ణించారు.
వ్యక్తిగత విషయాలు చాలా సున్నితమైనవని, వాటిని గౌరవించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.
మహిళా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ట్రోలింగ్ జరుగుతున్న విషయంపై స్పందిస్తూ, బాధ్యత లేకుండా వ్యాఖ్యలు చేసే వారు కేవలం “సాడిస్టిక్ ప్లెజర్” కోసం అలా చేస్తారని అన్నారు. వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కుష్బూ పేర్కొన్నారు.
