
ఒకప్పుడు అంటే ముఖ్యంగా కోవిడ్ సమయంలో OTT కంటెంట్ కి చాలా క్రేజ్ ఉండేది. ఆ సమయంలో వెబ్ సిరీస్ లకు చాలా పాపులారిటీ వచ్చింది. దాంతో, పలువురు హీరోలు, హీరోయిన్లు ఓటిటి షోలు, సిరీస్ లు చేశారు. సమంత, తమన్నా, రానా, బాలకృష్ణ, నాగ చైతన్య, శోభిత, కియారా అద్వానీ… ఇలా ఎందరో ఓటిటి కంటెంట్ లో పాల్గొన్నారు.
ఐతే ఇప్పుడు అలాంటి వాటికి క్రేజ్ పోయింది. ఇప్పుడు ఒటిటి వైపు వెళ్లేందుకు పేరున్న స్టార్స్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి టైములో తేజ సజ్జా, కిరణ్ అబ్బవరం వంటి యువ హీరోలు తాజాగా ఓటిటి ప్లాట్ ఫార్మ్ కోసం షోలు, వెబ్ సిరీస్ లు ఒప్పుకోవడం, వాటిని పూర్తి చెయ్యడం విచిత్రంగానే అనిపిస్తోంది.
తేజ సజ్జా (Teja Sajja)
‘హనుమాన్’, ‘మిరాయ్’ వంటి బ్లాక్బస్టర్లతో యువతలో క్రేజ్ సంపాదించుకున్న తేజ తాజాగా ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టాడు. ఆమెజాన్ ప్రైమ్ వీడియో కోసం “The Traitors “అనే రియాల్టీ షో తెలుగు వెర్షన్ను హోస్ట్ చేస్తున్నాడు తేజ సజ్జా. 20 మంది సెలబ్రిటీలతో తెరకెక్కే ఈ షో.. సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఓటీటీ రియాలిటీ షోగా నిలవనుంది. హీరోగా విజయాలు పొందిన తర్వాత ఇప్పుడు ఓటిటి షో ఒప్పుకోవడం విచిత్రమే.
కిరణ్ అబ్బవరం (KIran Abbavaram)
ఇప్పటికే పది సినిమాల్లో నటించాడు కిరణ్ అబ్బవరం. హిట్లు ఉన్నాయి. ఫ్లాపులు ఉన్నాయి. ఐతే ఇటీవల హీరోగా మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. చేతిలో “చెన్నై లవ్ స్టోరీ” అనే మూవీ ఉంది. ఈ హీరో కూడా ఆమెజాన్ కోసం ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాడు. దాని పేరు ‘గువ్వల చెరువు ఘాట్’ (Guvvala Cheruvu Ghat). ఇది త్వరలోనే స్ట్రీమ్ కానుంది.
నాగ చైతన్య (Naga Chaitanya)
ఇక నాగ చైతన్య ఇప్పటికే “దూత” అనే వెబ్ సిరీస్ చేశాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ కి రెండో సీజన్ రానుంది. దానికి ఓకె చెప్పాడు నాగ చైతన్య.
