
రేణు దేశాయి మరోసారి వార్తల్లో నిలిచారు. నిన్న ఆమె వీధి కుక్కల సరంక్షణ గురించి ప్రెస్ మీట్ లో ఆవేశంగా మాట్లాడారు. ఇటీవల సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పుని కూడా తప్పుపట్టి హడావిడి చేశారు. ప్రెస్ మీట్ తర్వాత బేలతనం చూపిస్తున్నారు. తనని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు అని, తనకు రాజకీయాల మీద ఆసక్తి లేదని, మీడియా మీద మండిపడలేదని ఆ తర్వాత వివరణ ఇచ్చారు.
అయినా ఆమెకి ట్రోలింగ్ సెగ తగ్గలేదు. అందుకే, ఇప్పుడు మరింత బేలతనం చూపిస్తూ తనని కాపాడేందుకు తల్లితండ్రులు లేరు, భర్త లేడు పోస్ట్ పెట్టారు. ఆమె తన భర్త పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాయి చాలా ఏళ్ళు అవుతోంది.
“నన్ను రక్షించేందుకు తండ్రి లేడు, తల్లి లేదు, అన్నయ్య లేడు, భర్త లేదు. మీరు నాపై చూపిస్తున్న ద్వేషాన్ని అంతా దేవి, మహాదేవ్లతో ప్రశాంతంగా పంచుకుంటాను. వాళ్లే నా బాధను, కన్నీళ్లను తుడిచేస్తారు,” అని పోస్ట్ పెట్టారు ఆమె.
ALSO READ: Renu Desai urges compassion after dog attacks
రేణు దేశాయి తన కొడుకు అకీరా నందన్, కూతురు ఆద్యతో ఉంటుంది. అకీరా త్వరలోనే హీరోగా పరిచయం కానున్నాడు.
