
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94వ ఏట తీసిన చిత్రం.. సింగ్ గీతం (Sing Geetham). ఈ సినిమా జూన్ 11న విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు జూన్ 12కి వాయిదా పడింది. అంటే ఒక రోజు ఆలస్యంగా రానుంది. కథలో కీలక పాత్ర పోషించే కొన్ని ముఖ్యమైన విజువల్ ఎఫెక్ట్స్ పనులను మరింత మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీం ప్రకటించింది.
తాజాగా సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ లభించింది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయాన్, అహల్యా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, శాలిని కొండెపూడి విలన్ గా నటిస్తున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో పాటలు, నేపథ్య సంగీతం మెయిన్ హైలెట్స్ గా నిలవనున్నాయి. సినిమాలో మాటలు ఉండవు. మాటలనే పాటలుగా పాడుతారు నటులు. అదే ఈ సినిమా స్పెషాలిటీ.
ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాకి నిర్మాత. అలాగే ఈ సినిమా అవుట్ ఫుట్ మొత్తం తానే దగ్గరుండి పర్యవేక్షించారు.
