
లయ నటన గురించి మాట్లాడుతూ ఆమె అప్పట్లో నందులను తెగ లాగేసుకునేది అని అన్నారు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి. ఆ క్రమంలో నందులు పందులు అనే ప్రాస వాడి ఆయన ఇరుకున పడ్డారు. తాజాగా ఆయన ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.
నంది అవార్డు అందుకోవాలనేది నాకల
”ఆ ఈవెంట్లో చిన్నగా మాట దొర్లాను. అది నా స్టేట్మెంట్ కాదు. 12 సంవత్సరాల క్రితం ఎవరో అన్న స్టేట్మెంట్ను గుర్తు చేశాను. అప్పట్లో ఇలా అనేవారు అనబోయి అలా మాట దొర్లింది. నాకు దేవుడి మీద , అవార్డ్స్ మీద అపారమైన గౌరవం వుంది. దేవుడి అంటే ఎంతో భక్తి ఉందో, అవార్డ్స్ మీద కూడా గౌరవం ఉంది. నాకు చిన్నప్పటి నుండి నంది అవార్డ్స్ లాంటి అవార్డు అందుకోవాలని ఆశగా ఉండేది. ఆ కలతోనే సినీ పరిశ్రమకు వచ్చాను,” అని నందిపాటి క్లారిటీ ఇచ్చారు.
ఇటీవల సుహాస్, శివానీ నగారం జంటగా రూపొందిన “హే బల్వంత్” సినిమాని ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం వినూత్నంగా థాంక్యూ మీట్ ఫర్ బ్రేక్ ఈవెన్ డన్ ఈవెంట్ను నిర్వహించింది. ఈ సందర్బంగా ఆయన వివరణ ఇచ్చారు.
“హే బల్వంత్ సినిమాను దాదాపు 10 క్లోట బడ్జెట్తో నిర్మించాం. ఓటీటీ, శాటిలైట్ ఇతర హక్కులు, థియేటర్స్ కలెక్షన్స్ అన్ని కలిసి ఆ పది కోట్లు పెట్టుబడి సాధించాం. ముఖ్యంగా యూఎస్లో మంచి వసూళ్లు వచ్చాయి. రానున్న రోజుల్లో ప్రాఫిట్స్ జోన్లోకి వెళతాం,” అన్నారు.
